ప్రభాస్ సలార్ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రశాంత్ నీల్..?

పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఇకపోతే ప్రభాస్ కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ ప్రాజెక్టు కె షెడ్యూల్స్ తో బిజీగా ఉండటం వల్ల కొన్ని రోజులపాటు ఈ సినిమాను వాయిదా వేశారు.

ప్రాజెక్ట్ కే షెడ్యూల్ ముగిసిన తర్వాత ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్లో పాల్గొంటారు.

ఇకపోతే ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ భారీ యాక్షన్ సన్నివేశంతో ఉండబోతోందని మనకు తెలిసిందే.

ఇప్పటికే ఈ షూటింగ్ పూర్తి అయిందని అయితే ఈ సన్నివేశాలపై ప్రశాంత్ నీల్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

"""/" / ఇక ఈ యాక్షన్ సన్నివేశం తనకి తృప్తి కలిగించకపోగా ఇందులో కొన్ని మార్పులు చేసి తిరిగి యాక్షన్ సన్నివేశాన్ని షూటింగ్ చేయాలని భావించారు.

ఇక ప్రశాంత్ నీల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభాస్ అభిమానులు స్వాగతిస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించడం వల్ల ప్రతి చిన్న విషయంలోనూ డైరెక్టర్ ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వకపోతే మేమేం చేస్తాం…. సత్తి సూర్యనారాయణ రెడ్డి