మాంసాహార మొక్క గురించి విన్నారా? మన ఉత్తరాఖండ్లో వున్న అరుదైన జాతి అది!
TeluguStop.com
భారత దేశంలోని అంత్యంత మంచుతో కూడిన ప్రాంతాలలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒకటి.అక్కడి ప్రకృతి వాతావరణం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఆ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు మొదటిసారిగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఓ అరుదైన మాంసాహార మొక్కను కనుగొన్నారు.
దీని బొటానికల్ శాస్త్రీయ నామం ట్రిక్యులారియా ఫుర్సెల్లాటా.సెప్టెంబరు 2021లో ఉత్తరాఖండ్ అడవుల రీసెర్చ్ వింగ్ బృందం ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా, మండల్ లోయలో 4,800 అడుగుల ఎత్తులో ఈ మొక్కను కనుగొనడం విశేషం.
ఇక ఈ మొక్క దేశంలో చివరిసారిగా 1986లో ఈశాన్య మేఘాలయ రాష్ట్రంలో కనిపించిందని భోగట్టా.
ఈ సమాచారాన్ని ప్రతిష్టాత్మకమైన 'జర్నల్ ఆఫ్ జపనీస్ బోటనీ'లో డాక్యుమెంట్ చేశారు.ఉత్తరాఖండ్ లో మాత్రమే కాకుండా మొత్తం పశ్చిమ హిమాలయ ప్రాంతంలోనే ఈ మొక్కను చూడటం ఇదే మొదటిసారి అని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంజీవ్ చతుర్వేది PTI వార్తా సంస్థకు తాజాగా తెలిపారు.
సాధారణంగా ఈ మొక్క పోషకాలు లేని నేలపై పెరుగుతుందని అన్నారు.దీని సంభావ్య ఔషధ ప్రయోజనాల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ సమూహంలో కొత్త ఆసక్తిని రేకెత్తించిందని చతుర్వేది తెలిపారు.
"""/"/
ఇకపోతే బేసిగ్గా వీటిని 'బ్లాడర్వోర్ట్లు' అని అంటారు.ఇది అత్యంత అధునాతనమైన, అభివృద్ధి చెందిన మొక్కల నిర్మాణాలు కలిగి ఉంటుంది.
ఇక ఈ మొక్కభాగంలో ఉచ్చు అనే ఓ పరికరంలాంటి భాగం ఉంటుంది.దీని సహాయంతో ప్రోటోజోవా నుండి కీటకాలు, దోమల లార్వా, యువ టాడ్పోల్స్ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటుంది.
ఉత్తరాఖండ్ లోని క్రిమి సంహారక మొక్కల ప్రాజెక్టు సంబంధించిన అధ్యయనంలో భాగంగా ఈ ఆవిష్కరణ జరిగింది.
అయితే, ఈ జాతులు పర్యాటక ప్రదేశంలో ఉండటం వల్ల, భారీ జీవసంబంధ ఒత్తిడి వల్ల ముప్పును ఎదుర్కొంటున్నాయని నిపుణులు వెల్లడించారు.
అమ్మాయి వల్ల వరుణ్ లావణ్య విడాకులు తీసుకుంటారు..ఆ దోషాలు ఉన్నాయి: వేణు స్వామి