నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న వివాహేతర సంబంధం..!
TeluguStop.com
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతూ ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్నాయి.
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వారిలో చాలామంది వివాహితులే.భర్తకు తెలియకుండా భార్య.
భార్యకు తెలియకుండా భర్త వివాహేతర సంబంధాలను కొనసాగించి, అడ్డంగా దొరికిపోయిన తరువాత ఒకరు హత్యకు గురైతే మరొకరు జైలు పాలు అవుతున్నారు.
ఈమధ్య ఇలాంటి దారుణాలే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.ఈ కోవలోనే ఒక వ్యక్తికి చేతులు, కాళ్లు కట్టేసి ఓ గోనెసంచిలో వేసి నడుముకు రాయి కట్టి చెరువులో పడేశారు.
అయితే సోమవారం ఉదయం మృతదేహం ఉన్న గోనెసంచి చెరువుపై తేలియాడుతూ కనిపించిన ఘటన రంగారెడ్డి జిల్లా( Rangareddy )లోని షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం. """/" /
సీఐ యాదయ్య గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.
మండల పరిధిలోని హైతాబాద్ చెరువులో ఓ గోనే సంచిలో మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు( Police ) ఘటన స్థలానికి చేరుకొని గోనెసంచిలోని మృతదేహాన్ని బయటకు తీశారు.
యువకుడి తలపై బలంగా కొట్టి కాళ్లు, చేతులు కట్టేసి నడుముకు ఒక బండరాయి కట్టి గోనే సంచిలో వేసి చెరువులో పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
"""/" /
మృతుడిని మండల పరిధిలోని సంకేపల్లి గూడ గ్రామానికి చెందిన కుమ్మరి ప్రవీణ్(31)( Praveen ) గా గుర్తించారు.
ఈ కుమ్మరి ప్రవీణ్ కు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
ప్రవీణ్ హత్యకు అక్రమ సంబంధమే కారణం అయి ఉంటుందని స్థానికులు పోలీసులకు తెలిపారు.
మృతుడి సోదరుడు కుమ్మరి ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివాహేతర సంబంధం కారణంగా హత్య జరిగిందా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
యూఎస్ గ్రీన్ కార్డ్.. భారత సంతతి వైద్యులను పట్టించుకోండి : ఎన్ఆర్ఐ డాక్టర్ల సంఘం