బ్రేకింగ్‌: విరాట పర్వం అఫిషియల్‌ గా ఆ విషయాన్ని ప్రకటించారు

ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభం అయిన తెలుగు సినిమాల జోరు కంటిన్యూ అవుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కరోనా సెకండ్‌ వేవ్‌ అంటూ పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి.

దాంతో ఏం చేయాలో పాలు పోక జనాలు మళ్లీ తమకు తామే స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోతున్నారు.

ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు కూడా పాక్షిక లాక్‌ డౌన్‌ లేదా ఆంక్షలు అంటూ ముందుకు వస్తుంది.

ఇలాంటి సమయంలో సినిమాల విడుదల ఎంత వరకు కరెక్ట్‌ అని చాలా మంది మేకర్స్‌ భావిస్తున్నారు.

అందుకే తెలుగు సినిమాల జోరుకు సెకండ్ వేవ్‌ దెబ్బ వేసింది.ఇటీవల కాలంలో వరుసగా సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా రాబోయే అయిదు ఆరు వారాల వరకు ఫిక్స్ అయిన సినిమాలన్నీ కూడా మెల్ల మెల్ల గా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి.

వకీల్‌ సాబ్‌ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చినా కూడా కరోనా భయం కారణంగా టికెట్లు తెగడం లేదు వసూళ్లు నమోదు అవ్వడం లేదు.

అందుకే ఇతర సినిమాలను కూడా విడుదల వాయిదా వేసుకోవడం మంచిది అనే అభిప్రాయంకు ఇండస్ట్రీ వర్గాల వారు వచ్చారు.

అందుకే వరుసగా సినిమాలను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.తాజాగా రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాటపర్వం సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

సినిమా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా విడుదల ఆపేస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు.కొత్త విడుదల తేదీ విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని వారు చెబుతున్నారు.

 సాయి పల్లవి నటించిన ఈ సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి.

ఇలాంటి సినిమా వాయిదా పడటం విచారకరం.

ఎడిటర్ ఇచ్చిన సలహా తో నిలబడిన తెలుగు సినిమాలు