‘విరాటపర్వం’ రిలీజ్‌ డేట్ వచ్చేసింది.. టాలీవుడ్ లో సందడే సందడి

టాలీవుడ్ లో మార్చి నుండి డిసెంబర్‌ వరకు చిన్న పెద్ద సినిమాల విడుదల లేకుండా పోయింది.

దాదాపుగా ఏడు ఎనిమిది నెలుల థియేటర్లు పూర్తిగా మూసి ఉన్నాయి.దాంతో జనాలు ఓటీటీ వైపుకు మళ్లారు.

చాలా సినిమాలు కూడా డైరెక్ట్‌ డిజిటల్ రిలీజ్ కు వెళ్లాయి.దాంతో మళ్లీ థియేటర్లు పుంజుకుంటాయా అనే అనుమానంను చాలా మంది వ్యక్తం చేశారు.

అసలు సినిమా హాల్స్ కు జనాలు వస్తారా అనే అనుమానాలను పటా పంచలు చేస్తూ క్రాక్‌ సినిమా దాదాపుగా 50 కోట్లక పైగా వసూళ్లు నమోదు చేసింది.

దాంతో బాక్సాఫీస్ ముందుకు వరుసగా సినిమాలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో పలు సినిమాలు విడుదల తేదీలను నిర్ణయించుకుంటున్నాయి.

ఈ ఏడాది పెద్ద చిన్న సినిమాలు చాలా విడుదల వాయిదా పడ్డాయి.కనుక సమ్మర్‌ నుండి సందడి మొదలు కాబోతున్నాయి.

కనుక సినిమా ల విడుదల తేదీ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.వచ్చే ఆరు ఏడు నెలల వరకు కూడా విడుదల తేదీలను బుక్ చేసుకుంటున్నారు.

విరాట పర్వం సినిమా కూడా అదే దారిలో విడుదల తేదీ ని ఖరారు చేసుకుంది.

రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విరాట పర్వం సినిమాను ఏప్రిల్‌ 30 2021 లో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఏప్రిల్ లో పవన్‌ కళ్యాన్ వకీల్‌ సాబ్‌ సినిమా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో రానా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు రానా అరణ్య మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు.మొత్తానికి పదుల కొద్ద సినిమాల విడుదల తేదీలను గత రెండు మూడు రోజులుగా క్లారిటీ ఇవ్వడంతో అంతా కూడా హ్యపీ ఫీల్ అవుతున్నారు.

టాలీవుడ్‌ లో కొత్త సినిమాల హడావుడి మామూలుగా లేదు.అతి త్వరలోనే థియేటర్లు పూర్తి స్థాయిలో నడిపేందుకు అవకాశం ఉంటుంది.

కేంద్రం నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చేందుకు సుముఖంగా ఉంది.కనుక అన్ని సినిమాలు కూడా సమ్మర్ నుండి క్యూ కడుతున్నాయి.

ముద్రగడపై నటుడు పృథ్వీరాజ్ సీరియస్ వ్యాఖ్యలు..!!