ఇద్దరు హీరోలకు తల్లిగా శివగామి

ఒకప్పటి స్టార్ బ్యూటీ రమ్యకృష్ణ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

కాగా బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణ తన నటనతో ఆ సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

శివగామి పాత్ర కేవలం రమ్యకృష్ణ తప్ప మరెవరూ చేయలేరనే వార్త ఇండస్ట్రీ జనాల్లో ఏర్పడిందంటే, ఆమె యాక్టింగ్ ఏ లెవెల్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక బాహుబలి సినిమా తరువాత రమ్యకృష్ణ చేసిన సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు రాకపోయినా ఆమె సినిమాలో నటిస్తే ఆ సినిమాకే బలం చేకూరుతుందని చిత్ర యూనిట్ భావించింది.

ఈ క్రమంలో రమ్యకృష్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు కేరాఫ్‌గా మారింది.దీంతో యంగ్ హీరోలు అయిన విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్‌లకు తల్లి పాత్రలో నటించేందకు రెడీ అవుతోంది.

పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటిస్తుండగా, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న బాక్సార్ చిత్రంలో కూడా ఆమె తల్లిగా నటిస్తోంది.

మొత్తానికి రమ్యకృష్ణ తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకోవడమే కాకుండా ఆసక్తికర పాత్రలను దక్కించుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటోంది.

మరి రాబోయే యంగ్ హీరోల చిత్రాలలో ఆమె ఎలాంటి పాత్రలు దక్కించుకుంటుందో, ఆ పాత్రలు ఆమెకు ఎంతమేర పేరు తీసుకొస్తాయా అని అందరూ ఆలోచిస్తున్నారు.

ఆ గొప్పదనాన్ని పిల్లలకు తెలియజేసే బాధ్యత మనదే.. రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్!