మహేష్ బాబు కోసం ఆ సీనియర్ నటి ఫిక్స్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో కాంబో అదుర్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో పేర్చుకులను పలకరించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం మహేష్ బాబు తన తదుపరి సినిమాపై దృష్టిని పెట్టారు.కాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

కొన్ని ఏండ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల సెప్టెంబర్ 12న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు.

భారీ యాక్షన్ ఎపిసోడ్ నేపథ్యంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు.

తమిళ పాపులర్ ఫైట్ మాస్టర్స్ అన్బు అరివు ఈ మూవీకి యాక్షన్ ఘట్టాలని కంపోజ్ చేస్తున్నారు.

నెల రోజుల పాటు ఈ యాక్షన్ ఘట్టాలకు సంబంధించిన లాంగ్ షెడ్యూల్ జరుగుతుందని తెలుస్తోంది.

ఈ షెడ్యూల్ మూవీకి ప్రధాన హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.ఇదిలా వుంటే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

"""/" / అదేమిటంటే త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం ఒక కీలకపాత్రలో నటించడానికి సీనియర్ హీరోయిన్ అయినా రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నారట.

ఒక గతంలో హీరో మహేష్ బాబు నటించిన నాని సినిమా కోసం రమ్యకృష్ణ రొమాంటిక్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే.

మళ్లీ చాలాకాలం తర్వాత మహేష్ బాబుతో కలిసి రమ్యకృష్ణ నటించిన ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో రమ్యకృష్ణ ఈ సినిమాలో ఎటువంటి పాత్ర చేయబోతోంది అంటూ ఆరా తీయడం మొదలు పెట్టేశారు.

అయితే రమ్యకృష్ణ ఈ మూవీలో మహేష్ కు అత్తగా కనిపించనుందని తెలుస్తోంది.2023 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

వినాయక్ కొత్త సినిమాకు అసలు సమస్య ఇదేనా.. ఆ రీజన్ల వల్లే వెనక్కు తగ్గుతున్నారా?