మరోసారి నీలాంబరిగా మారుతున్న శివగామి

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటిన రమ్యకృష్ణ, గతకొంత కాలంగా క్యారెక్టర్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.

ఈ క్రమంలో ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రలను చేస్తూ ముందుకెళ్తోంది.కాగా టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర ఆమెకు మరో టర్నింగ్ పాయింట్‌లా నిలిచింది.

ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.శివగామి పాత్రను రమ్యకృష్ణ కాకుండా వేరే ఎవరూ ఇంతబాగా చేయలేరేమో అనే స్థాయిలో రమ్యకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కాగా ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఓ సినిమాలో చాలా పవర్‌ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ నటించనుంది.

గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, అచ్చం అలాంటి పాత్రలో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రమ్యకృష్ణ రెడీ అవుతోంది.

దర్శకుడు దేవా కట్టా తెరకెక్కి్స్తున్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ మూవీలో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తుందట.

అయితే ఇది విలన్ పాత్ర కావడంతో చాలా పవర్‌ఫుల్‌గా చూపించేందుకు దేవా కట్టా అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

గతంలో దేవా కట్టా తెరకెక్కించిన ప్రస్థానం చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ పాత్రను ఇది పోలి ఉంటుందని చిత్ర వర్గాల టాక్.

దీంతో మరోసారి నీలాంబరి స్థాయి పాత్ర రమ్యకృష్ణకు పడిందని, ఈ పాత్రలో రమ్యకృష్ణ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

మరి ఈ సినిమాలో సీఎం పాత్రలో రమ్యకృష్ణ ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని తేజు అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.

డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకోవడం లేదు.. కాబోయే భర్త పై వరలక్ష్మి కామెంట్స్!