బోయినిపల్లి పశువైద్యాధికారిగా పనిచేస్తున్న రమేష్ కరీంనగర్ కు బదిలీ

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో 16 సంవత్సరాల పాటు పశు వైద్యాధికారిగా పనిచేసి రైతులకు ఎంతో సేవ చేశారు.

గేజిటెడ్ ఆఫీసర్ హోదాలో బోయినపల్లి మండలం లో వేలాదిమందికి కళ్యాణ లక్ష్మి, పత్రాలు ఇతర సర్టిఫికెట్ల పై సంతకాలు చేసి పేద ప్రజల మన్ననలు పొందాడు.

మండలంలో రైతులకు, పశువులకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా క్షణాల్లో గ్రామాలకు చేరుకుని రైతులకు సేవలు అందించారు.

16 సంవత్సరాలు రైతులకు, పశువులకు సంబంధించి సేవలు అందించిన వైద్యాధికారి రమేష్ బదిలీ కావడంతో మండలంలోని ప్రజాప్రతినిధులు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నారా లోకేష్ పెద్ద మనసు.. మరో గల్ఫ్ బాధితుడికి బాసట