డైరెక్టర్ కు క్షమాపణలు చెప్పిన రామ్.. కారణం అదేనా?

రామ్ పోతినేని.ఈయన పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేరు.

ఇంతకు ముందు అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉండేవాడు.కానీ ఇప్ప్పుడు ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ఆయన తన లుక్ ని పూర్తిగా మార్చి చాకొలేట్ బాయ్ కాస్త యాక్షన్ హీరోగా మారిపోయి మాస్ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.

ఈ సినిమా ఇచ్చిన జోష్ తో రామ్ మరిన్ని మాస్ అండ్ యాక్షన్ సినిమాలనే ఎంచుకుంటూ మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యి మాస్ హీరో అనిపించు కోవడానికి బాగా ట్రై చేస్తున్నాడు.

ప్రెసెంట్ రామ్ కోలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేస్తున్నాడు.

ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది.రామ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ అందరిని ఆకట్టుకున్నాయి.రామ్ తొలిసారి పోలీస్ యూనిఫామ్ వేసుకుంటున్నాడు.

ఇప్పటికే ఆయన తన పోలిస్ లుక్ తో ఆకట్టుకున్నాడు.ఇక ఈ సినిమా నుండి నిన్న మరో సాంగ్ ను రిలీజ్ చేసారు.

ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టారు.అయితే ఈ ప్రెస్ మీట్ లో అసలు డైరెక్టర్ గురించి రామ్ చెప్పకపోవడంతో ఈ రోజు ఈయన సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతూ పోస్ట్ చేసారు.

"""/" / అసలు మెయిన్ పర్సన్ గురించి చెప్పడం మర్చిపోయానని నా వారియర్, డైరెక్టర్ నా సినిమాను ముందు నుండి తన భుజాలపై మోసిన లింగుస్వామి సార్ మీరు నేను వర్క్ చేసిన బెస్ట్ డైరెక్టర్లలో ఒకరని దయచేసి క్షమించండి అంటూ ట్వీట్ చేసాడు.

నిన్న కంగారులో లింగుస్వామి గురించి చెప్పలేదని తెలిపాడు రామ్.ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తూ ఉండగా.

కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను జులై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే మేకర్స్ అనౌన్స్ చేసారు.

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

చేపల వర్షం ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్..