రామ్ గోపాల్ వర్మ మర్డర్ ఆ ఇద్దరి ప్రేమ కథేనంట…

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవిక సంఘటనలు మరియు సెలబ్రిటీల జీవితాలపై సినిమాలు తీస్తూ బాగానే ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

అయితే తాజాగ రామ్ గోపాల్ వర్మ "మర్డర్" అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్  కూడా యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు.

దీంతో కొందరు నెటిజన్లు ఈ చిత్ర ట్రైలర్ గురించి స్పందిస్తూ ఈ మర్డర్ చిత్రం గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా పరిసర ప్రాంతంలో జరిగినటువంటి ఓ వాస్తవిక సంఘటన ను ఆధారంగా చేసుకొని రామ్ గోపాల్ వర్మ  తెరకెక్కించాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కన్న కూతురు వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందని యువతి తండ్రి తన కన్న కూతురు భర్త అని కూడా చూడకుండా డబ్బు కోసం హత్యలు చేసేటువంటి కిరాయి హంతకుల చేత దారుణంగా అమృత భర్త ప్రణయ్ ని హత్య చేయించాడు.

అనంతరం పోలీసులకు లొంగిపోయి బెయిల్ మీద బయటకు వచ్చి హైదరాబాద్ నగరంలో విషం సేవించి మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా బ్రతుకుతున్న అమృత కి ఈ మర్డర్ చిత్ర ట్రైలర్ ద్వారా మళ్ళీ అన్ని గుర్తొచ్చేలా చేశాడని కొందరు రామ్ గోపాల్ వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు మాత్రం ఈ వాస్తవిక సంఘటనల ద్వారా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా సమాజానికి రామ్ గోపాల్ వర్మ మళ్లీ ఏదో మెసేజ్ ఇవ్వబోతున్నాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 .

ఆ స్థానాల్లో మేమే గెలుస్తాం .. బీఆర్ఎస్ ధీమా వెనుక ..?