పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో చరణ్.. ఈ పిక్ వెనుక అసలు స్టోరీ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా వెలుగొందు తున్నాడు.

మునుపటి కంటే మరింత యాక్టివ్ గా ఉంటూ తన లైనప్ ను ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో ఫిల్ చేసుకుంటున్నాడు.

ఈయన ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవ్వడంతో ఈయన సినిమాలపై కూడా అందరిలో ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా రామ్ చరణ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

రామ్ చరణ్ ను పాన్ ఇండియన్ ప్రొడ్యూసర్స్( Pan India Producers ) కలిసిన పిక్ వైరల్ కాగా వీరి భేటీకు కారణం ఏంటా అని అంతా ఆరా తీస్తున్నారు.

రామ్ చరణ్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని,( Naveen Yerneni ) డీవీవీ ఎంటర్టైన్మెంట్ అధినేత డీవీవీ దానయ్య లతో( DVV Danaiah ) పాటు ప్రముఖ రాజకీయ నాయకుడు గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao ) కూడా ఈ ఫొటోలో కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

"""/" / పాన్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ తో పాటు రాజకీయ నాయకుడితో చరణ్ ఎందుకు భేటీ అయ్యారు అసలు వీరి మధ్య భేటీకి కారణం ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

మరి తర్వాత అయిన ఈ భేటీకి కారణం తెలుస్తుందో లేదో చూడాలి.ఇక ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' సినిమా( Game Changer ) చేస్తున్నాడు.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

"""/" / పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది.వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక చరణ్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ తన 16వ ప్రాజెక్ట్ ను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో ప్రకటించాడు.

గేమ్ చేంజర్ షూట్ అవగానే ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

‘రైతు యాత్ర ‘ తో జనాల్లోకి కేసీఆర్