యువ దర్శకుడుకి అవకాశం ఇవ్వబోతున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నాడు.ఈ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో తనని తాను షో అప్ చేసుకునే పనిలో పడ్డాడు.

గతంలో జంజీర్ మూవీతో స్ట్రైట్ గా హిందీ ప్రేక్షకులని రామ్ చరణ్ పలకరించాడు.

అయితే ఆ మూవీ డిజాస్టర్ అయ్యి రామ్ చరణ్ కి ఊహించని షాక్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ మూవీ రాజమౌళి దర్శకత్వంలో వస్తూ ఉండటంతో కచ్చితంగా హిందీ హిందీ ప్రేక్షకులు తనని రిసీవ్ చేసుకుంటారనే గట్టి నమ్మకంతో రామ్ చరణ్ ఉన్నాడు.

ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత తమిళ్ స్టార్ దర్శకుడు శంకర్ తో ఒక మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు.

దిల్ రాజు ఈ మూవీని రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమయ్యాడు.

అయితే ఇప్పుడు శంకర్, ఇండియన్ 2 నిర్మాతలైన లైకాకి మధ్య వివాదం నడుస్తుంది.

ఈ వివాదం పరిష్కారం అయ్యి ఇండియన్ 2 కంప్లీట్ చేసిన తర్వాత గాని రామ్ చరణ్ తో సినిమాని స్టార్ట్ చేసే అవకాశం శంకర్ కి లేదు.

"""/"/ ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ కోసం వెయిట్ చేస్తే మరో ఏడాది ఖాళీగా ఉండాల్సి వస్తుందని రామ్ చరణ్ కి క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో రీసెంట్ గా ఓ యువ దర్శకుడు చెప్పిన స్టొరీ విన్న రామ్ చరణ్ ఫుల్ గా ఇంప్రెస్ అయిపోయినట్లు టాక్ వినిపిస్తుంది.

దీంతో ఈ మూవీని కొనెదల ప్రొడక్షన్ బ్యానర్ లోనే తానే నిర్మించడంతో మినిమమ్ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కించాలని చూస్తున్నట్లు బోగట్టా.

అయితే ఆ దర్శకుడు ఎవరనే విషయం ఇంకా తెలియకుండా ఇప్పటికే ఆ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని సమాచారం వినిపిస్తుంది.

తక్కువ రోజుల్లో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి అవుట్ పుట్ బట్టి అయితే పాన్ ఇండియా రేంజ్ లో లేదంటే సౌత్ బాషలలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

దీనిపై ఆర్ఆర్ఆర్ కంప్లీట్ అయిన తర్వాత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.

అప్పుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనుకున్నా.. కానీ : గతాన్ని గుర్తుచేసుకున్న జో బైడెన్