బాలయ్య అన్‌ స్టాపబుల్‌ లో కేటీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌..!

తెలుగు ప్రేక్షకుల ముందుకు ఇప్పటి వరకు ఎన్నో టాక్ షో లు వచ్చాయి.

కానీ ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్‌ కి వచ్చిన రెస్పాన్స్‌.

వస్తున్న రెస్పాన్స్ మరే షో కు దక్కలేదు.అందుకే సినీ ప్రముఖుల నుండి రాజకీయ ప్రముఖుల వరకు ఎంతో మంది ఈ షో లో పాల్గొంటున్నారు.

తెలుగు టాక్ షో లకు దూరంగా ఉండే ప్రభాస్ ను కూడా బాలయ్య తన షో లో తీసుకు వచ్చి రచ్చ చేసిన విషయం తెల్సిందే.

ఇప్పుడు మరో ఇద్దరు క్రేజీ గెస్ట్‌ లను తీసుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ చరణ్‌ మరియు కేటీఆర్ లను అన్ స్టాపబుల్‌ షో కు తీసుకు రాబోతున్నాడు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.రామ్‌ చరణ్‌ ఇప్పటికే ఓకే చెప్పగా మంత్రి కేటీఆర్ డేట్‌ ను కేటాయించాల్సి ఉంది.

ఆ తేదీ లో షూటింగ్ ను ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ సీజన్ లో చాలా ప్రత్యేకమైన గెస్ట్‌ లు ఇప్పటి వరకు వచ్చారు.

రామ్‌ చరణ్‌ మరియు కేటీఆర్ కలిసి వస్తే కచ్చితంగా షో యొక్క స్థాయి మరింత పెరగడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

"""/"/కేటీఆర్‌ ఒక రాజకీయ నాయకుడు అయినా కూడా ఆయన గురించి ఆయన పర్సనల్‌ విషయాలను తెలుసుకునేందుకు జనాలు ఆసక్తిగా ఉంటారు.

బాలయ్య షో లో కేటీఆర్‌ వస్తే కచ్చితంగా ఇంట్రెస్టింగ్‌ గా ఉంటుంది.రామ్‌ చరణ్ కూడా బాలయ్య షో లో సందడి చేస్తే మరో లెవల్‌ అన్నట్లుగా ఉండటం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం బాలయ్య షో పవన్‌ యొక్క ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

ఫిబ్రవరి లో ఆ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ ఉంటుందట.ఆ తర్వాత రామ్‌ చరణ్‌ మరియు కేటీఆర్‌ ఎపిసోడ్‌ ఉంటుందా లేదంటే ముందే ఉంటుందా అనేది చూడాలి.

తమ పాత్రలను తామే డిజైన్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు వీరే !