భారత్ జోడో యాత్రకు ఏడాది పూర్తైన వేళ హైదరాబాద్‎లో ర్యాలీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారత్ జోడో యాత్రకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ చేపట్టనున్నారు.

ఇందులో భాగంగా హైదరాబాద్ సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరమ్మ విగ్రహం వరకు ప్రదర్శన చేయనున్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావుతో పాటు పార్టీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు.

ర్యాలీ అనంతరం నెక్లెస్ రోడ్డు వద్ద కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.

ఈ మేరకు ఇప్పటికే పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

ప్రేమికుల కోసం ప్రత్యేకమైన గొడుగు.. వీడియో చూస్తే ఫిదా..??