వైఎస్సార్ నాన్న నన్ను మనవడిలా పెంచారు.. రాకేష్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

దేశంలోని ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా రాకేష్ మాస్టర్ పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.

తన సినీ కెరీర్ లో రాకేష్ మాస్టర్ 1500కు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్లుగా చలామణి అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ రాకేష్ మాస్టర్ శిష్యులు అనే సంగతి తెలిసిందే.

యూట్యూబ్ లో ఇచ్చిన వివాదాస్పద ఇంటర్వ్యూల ద్వారా రాకేష్ మాస్టర్ కు పాపులారిటీ దక్కింది.

తిరుపతిలో జన్మించిన రాకేష్ మాస్టర్ పలువురు ప్రముఖ నటులకు శిక్షణ ఇచ్చారు.ప్రముఖ టాలీవుడ్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కూడా రాకేష్ మాస్టర్ కు శిష్యుడు కావడం గమనార్హం.

తాను చెన్నైకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు వెళ్లేవాడినని రాకేష్ మాస్టర్ వెల్లడించారు.

తిరుపతి లో నా ఇన్స్టిట్యూట్ పెద్ద ఇన్సిట్యూట్ అని రాకేష్ మాస్టర్ అన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాన్న నన్ను మనవడిలా పెంచాడని రాకేష్ మాస్టర్ వెల్లడించారు.

రాజశేఖర్ రెడ్డి అన్న, రాజారెడ్డి అన్న మా ఇంటికి వచ్చేవాళ్లని రాకేష్ మాస్టర్ పేర్కొన్నారు.

"""/"/ రాజారెడ్డి తాత సెటిల్ మెంట్లు చేసేవారని మా గురువు గారి ల్యాండ్ సెటిల్ మెంట్ చేయాల్సి రావడంతో రాజా రెడ్డి పరిష్కరించారని రాకేష్ మాస్టర్ అన్నారు.

రాజారెడ్డి తాత వస్తున్నారంటే రేణిగుంటలో డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టేవాడినని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

తిరుపతిలో ఊర్వశి హోటల్ కు లీడర్స్ వచ్చేవారని మనవడా! రాగిసంగటి ముద్ద ఇస్తా తిను అని ఆయన చెప్పేవారని రాకేష్ మాస్టర్ వెల్లడించారు.

"""/"/ డాక్టర్ శివప్రసాద్ తన గురువుగారని రాకేష్ మాస్టర్ పేర్కొన్నారు.రాజేంద్ర ప్రసాద్ తనకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పారని రాకేష్ మాస్టర్ వెల్లడించారు.

పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్న రాకేష్ మాస్టర్ ఆ ఇంటర్వ్యూలలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.

హనుమాన్ జయంతి శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే..!