రవితేజ బ్యూటీ సీబీఐ ఆఫీసర్ డాటర్ అని మీకు తెలుసా?
TeluguStop.com
మాస్ రాజా రవితేజ ప్రెసెంట్ శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ' చేస్తున్నాడు.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.
ఈ సినిమాలో రవితేజ కు జోడీగా రజిషా విజయన్, దివ్యంసా కౌశిక్ నటిస్తున్నారు.
ఈ సినిమా నుండి వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ ఇప్పటికే హోప్స్ పెంచేసింది.జులై 29న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం మాస్ రాజా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో నటిస్తున్న రజిషా విజయన్ గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.
మొదటి నుండి కూడా ఈమె గురించి ఆరా తీయడం ఫ్యాన్స్ మొదలు పెట్టారు.
అసలు రజిషా విజయన్ ఎవరు? ఎక్కడి నుండి వచ్చింది? అంటూ వరుసగా తమకు కావాల్సిన సమాచారం తెలుసుకునే పనిలో పడ్డారు.
ఈమె ముందు యాంకర్ గా పని చేసి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించడంతో ఈమె ట్యాలెంట్ చూసి దర్శక నిర్మాతలు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు.
"""/" / ముందు రజిషా విజయన్ మలయాళం సినిమాల్లో అవకాశం అందుకుంది అక్కడి నుండి తమిళ్ లో కూడా అడుగు పెట్టి ఏకంగా ధనుష్ నటించిన కర్ణన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి చాలా మంది దృష్టిలో పడింది.
ఈ సినిమాలో ఈమె నటనకు అంతా ఫిదా అవ్వడంతో సూర్య జై భీమ్ లో కూడా కీలక పాత్రలో అవకాశం లభించింది.
"""/" /
ఇక ఇప్పుడు మలయాళం, తమిళ్ లో వరుస అవకాశాలు అందుకుంటూనే మన టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతుంది.
ఈ క్రమంలోనే ఈమె ఫ్యామిలీ గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
ఈమె తండ్రి సిబిఐ లో పని చేసేవారని తెలిపింది.ఈ విషయం తెలిసి అందరు అవాక్కవుతున్నారు.
మరి ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి.
జుట్టు ఒత్తుగా మారాలా.. చుండ్రు పోవాలా.. అయితే ఈ రెమెడీ మీకోసమే..!