దీపావళికి టెండర్ పెట్టిన తలైవా

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కోసం కేవలం తమిళ ప్రేక్షకులే కాకుండా తెలుగు, హిందీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

కాగా రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

తమిళ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ విషయంపై చిత్ర యూనిట్ తాజాగా ఓ క్లారిటీ ఇచ్చేసింది.

ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

ఈ సినిమాను నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఇక ఈ అనౌన్స్‌మెంట్‌తో తలైవా అభిమానుల్లో సంతోషం నెలకొంది.రజినీకాంత్ నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామలు నయనతార, కీర్తి సురేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, డి.

ఇమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తు్న్నాడు.అన్నాత్తే సినిమాతో బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ సినిమాతో రజినీకాంత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే దీపావళి వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

జగన్ ప్రమాణ స్వీకార తేదీన త్వరలో ప్రకటిస్తామంటున్న మంత్రి బొత్స..!!