అధిష్టానం ఆదేశిస్తే పదవికి రాజీనామా.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే తన సీఎం పదవికి రాజీనామా చేస్తానని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.

రాజస్థాన్ లో కాంగ్రెస్ సంక్షోభానికి కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్ గెహ్లాట్ పై పార్టీ హై కమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

సంక్షోభం తర్వాత ఢిల్లీలో సోనియా గాంధీతో గెహ్లాట్ భేటీ అయ్యారు.మరోవైపు రెండు రోజుల్లో సీఎం మార్పుపై నిర్ణయం ఉంటుందని రాష్ట్ర పరిశీలకుడు కేసి వేణుగోపాల్ ప్రకటించారు.

ఇటు ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ వేసేందుకు శశిధరూర్, దిగ్విజయ్ సింగ్ సన్నద్ధమైన విషయం తెలిసిందే.

KTR : ఢిల్లీకి యాత్రలు తప్పితే రేవంత్ చేసిందేమీ లేదు..: కేటీఆర్