జక్కన్న నుండి అది ఆశించొద్దు అంటోన్న మహేష్ ఫ్యాన్స్
TeluguStop.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయితే వేసవిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ను వాయిదా వేశారు చిత్ర యూనిట్.
ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
గతంలోనే ఈ సినిమా ఉంటుందని రాజమౌళి స్వయంగా ప్రకటించడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే మహేష్ బాబు పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ ఉంటుందని వారు ఆశించారు.
కానీ రాజమౌళి ఎప్పటిలాగే సైలెంట్గా ఉండిపోయాడు.సాధారణంగానే జక్కన్న ఓ సినిమా చేస్తుండగా, తన నెక్ట్స్ మూవీని ఎప్పుడూ ప్రకటించలేదు.
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన, ఎప్పటిలాగే తన ఫార్ములాను ఫాలో అవుతున్నాడు.
దీంతో మహేష్ ఫ్యాన్స్ ఈ కాంబో సినిమా గురించిన అప్డేట్ కోసం ఇప్పట్లో ఆశించొద్దని ఫిక్స్ అయ్యారు.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి నాటికి పూర్తి చేస్తాడని, ఆ తరువాతే మహేష్ సినిమా గురించి ఆలోచిస్తాడని వారు అంటున్నారు.
దీంతో మహేష్ ఫ్యాన్స్ ఒక్క క్లారిటీకి వచ్చారనే విషయం అర్ధం అవుతోంది.మరి జక్కన్నతో మహేష్ సినిమా గురించిన అప్డేట్ కోసం వారు ఎంతకాలం ఎదురుచూడాల్సి వస్తుందో చూడాలి.
వింటర్ లో చర్మాన్ని తేమగా ఉంచడానికి తోడ్పడే బెస్ట్ హోమ్ మేడ్ లోషన్ ఇదే!