రాజమౌళి ఫ్యాన్స్ ను బాధ పెట్టిన చిరంజీవి.. ఏం జరిగిందంటే..?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రాజమౌళి.

తొలి సినిమాతోనే భారీ సక్సెస్ సొంతం కావడంతో అదే కాంబినేషన్ లో సింహాద్రి సినిమా తెరకెక్కింది.

రాజమౌళి మొదట సింహాద్రి సినిమాను బాలకృష్ణతో తీయాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ తో తెరకెక్కించారు.

2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.ఈ సినిమాల తరువాత రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు మగధీర, ఈగ, బాహుబలి, బాహుబలి 2 సినిమాలు దర్శకుడిగా రాజమౌళికి విదేశాల్లో సైతం మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ప్రస్తుతం రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఆలస్యమవుతున్న ఆర్ఆర్ఆర్ విడుదల కావడానికి ఇంకా చాలా నెలల సమయం పట్టేలా ఉంది.

ఈ నెల 10వ తేదీన దర్శకధీరుడు రాజమౌళి పుట్టినరోజు.రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, కెమెరామెన్ సెంథిల్ రాజమౌళి కోసం స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.

అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే చిరంజీవి మాత్రం సోషల్ మీడియా వేదికగా రాజమౌళికి శుభాకాంక్షలు చెప్పలేదు.

రాజమౌళి పుట్టినరోజని చిరంజీవికి తెలియదని అనుకోవడానికి లేదు.ప్రస్తుతం చిరంజీవి కొడుకు రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలోనే నటిస్తున్నాడు.

నిన్న అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్బంగా విష్ చేసిన చిరంజీవి మొన్న రాజమౌళిని విష్ చేయడం మరిచిపోవడం గమనార్హం.

చిరంజీవి రాజమౌళికి పర్సనల్ గా విష్ చేశాడో లేదో తెలియదు కానీ సోషల్ మీడియా ద్వారా చిరంజీవి విష్ చేయకపోవడంతో రాజమౌళి ఫ్యాన్స్ బాధ పడుతున్నారు.

యూకేలో పెరిగిన అంత్యక్రియల ఖర్చులు.. ఎందుకో తెలిస్తే..