ఈనెల 10న మునుగోడు బిజెపి అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి నామినేషన్

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి.నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో.

నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్ధులు సిద్ధమవుతున్నారు.ఈ క్రమంలోనే మునుగోడు ఉపఎన్నికకు ఈనెల 10వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

బిజెపి అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

అదేవిధంగా నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ అయిన 14న భారీ ర్యాలీతో మరోసారి నామినేషన్ ను దాఖలు చేసే అవకాశం ఉంది.

కాంగ్రెస్ మోదీని విమర్శించడం హాస్యాస్పదం..: బండి సంజయ్