ఇండస్ట్రీలోకి రాకముందు నవీన్ పోలిశెట్టి ముంబైలో అలాంటి పనులు చేసేవారా?

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇకపోతే త్వరలోనే నవీన్ పోలి శెట్టి నటించినటువంటి మిస్ శెట్టి,మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mister Polishetty) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో స్టాండప్ కమెడియన్ రాజశేఖర్ మామిడన్న (Rajasekhar Mamidanna)నటించారు.ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన కూడా పాల్గొన్నారు.

అయితే గతంలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి నవీన్ తాను ఇండస్ట్రీలోకి రాకముందు ముంబైలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలియజేశారు.

అయితే తాజాగా రాజశేఖర్ మామిడన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ముంబైలో నవీన్ పడినటువంటి ఇబ్బందుల గురించి తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"""/" / ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.నవీన్ మీ అందరికీ ఇప్పుడు హీరోగా మాత్రమే తెలుసు కానీ నాకు ఈయన 2012 వ సంవత్సరం నుంచి తెలుసని తెలిపారు.

ముంబైలో బ్లూ క్రాస్( Blue Cross ) అని ఒక సంస్థ ఉంది.

అక్కడికి తాను స్టాండప్ కామెడీ చేయడానికి వెళ్లే వాడినని తెలిపారు.ఒకరోజు అక్కడికి వెళ్ళగా ఎవరు కూడా రాలేదు దీంతో స్టాండప్ కామెడీ చేయడానికి ఇక్కడికి ఎవరైనా వచ్చారా అంటూ అక్కడున్న వారిని అడగడంతో దూరంగా నిలుచున్నటువంటి నవీన్ ను చూపించారు.

"""/" / అలా తనతో పరిచయం ఏర్పడిందని ఈయన తెలియజేశారు.అప్పటినుంచి మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందని మెట్రోలో ప్రయాణం చేస్తూ మా ఇబ్బందులు అన్నిటిని చెప్పుకునే వాళ్ళమని తెలిపారు.

నవీన్ ఇలా ఇప్పుడు హీరోగా మంచి సక్సెస్ సాధించడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఈయన సినిమాలలోకి రాకముందు ముంబైలో పడిన ఇబ్బందుల గురించి తెలిపారు.

పూణె రోడ్లపై హడల్ పుట్టించిన చిరుతపులి.. ఈ వీడియో చూస్తే..??