తెలంగాణలో తొలిరోజు ముగిసిన రాహుల్ గాంధీ పాదయాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో తొలిరోజు పూర్తి చేసుకుంది.

ఇవాళే రాష్ట్రంలోకి ప్రవేశించగా.మూడు కిలో మీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేశారు.

అనంతరం ఆయన ఢిల్లీకి పయనమైయ్యారు.దీనిలో భాగంగా గూడబల్లేరు నుంచి హెలికాప్టర్ లో శంషాబాద్ కు చేరుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు.కాగా ఈనెల 26 వరకు రాహుల్ పాదయాత్రకు విరామం ప్రకటించనున్నారు.

ఈనెల 27న తిరిగి పాదయాత్ర ప్రారంభంకానుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ కథ మారుస్తున్న హరీష్ శంకర్…కారణం ఏంటి..?