రాధేశ్యామ్ లో పూజా చేస్తుంది డ్యూయల్ రోల్ కాదు

సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మరో పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్.

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.పారిస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ లవ్ డ్రామాలో ప్రభాస్ కి జోడీగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది.

వీరిద్దరిమధ్య వచ్చే రొమాంటిక్, లవ్ ట్రాక్ అద్భుతంగా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాకి సంబందించిన మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో తిరిగి లాక్ డౌన్ తర్వాత రీసెంట్ గా మళ్ళీ మొదలైంది.

ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన పారిస్ సిటీ సెట్ లో షూటింగ్ జరుగుతుంది.

ఇక పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమె పాత్రని పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ పరిచయం చేసింది.

ఈ సినిమాలో పూజాహెగ్డే పేరు ప్రేరణ అని క్లారిటీ వచ్చింది.ఇదిలా ఉంటే ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేస్తుందని చాలా కాలంగా ఒక వార్త ప్రచారంలో ఉంది.

అలాగే కథలో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఎపిసోడ్ కూడా ఉంటుందనే మాట వినిపించింది.

ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేయడం లేదని, ఒకే పాత్ర ఉంటుందని కానీ కాస్తా భిన్నంగా ఆమె క్యారెక్టరైజేషన్ ఉంటుందని సమాచారం.

ఆ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని టాక్.ఈ కారణంగా ఆమె రెండు పాత్రలు చేస్తుందనే ప్రచారం బయటకి వచ్చినట్లు తెలుస్తుంది.

అలాగే పునర్జన్మల నేపధ్యంలో చిత్ర కథ ఉంటుందనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తుంది.

లిక్కర్ కేసులో సిసోడియాకు బెయిల్ తిరస్కరణ..!