డాక్టరేట్ పట్టా ( అవార్డు ) పొందిన రాచర్ల గొల్లపల్లి యువకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన గుర్రాల విజయ్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా ఆయుర్వేదం నాడి వైద్యరంగంలో తన సేవలందిస్తున్నాడు.

ఈ సేవలను గుర్తించిన ఎషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ,హోసూరు, తమిళనాడు వారు గుర్రాల విజయ్ రెడ్డి కి గౌరవప్రదమైన డాక్టరేట్ అవార్డును శనివారం క్లారెస్టా హోటల్స్, హోసూర్ తమిళనాడు లో అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన మాస్టర్ వి.బాబు విజయన్ ఎషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపకులు & అడ్వైసరి బోర్డు, డా.

కె.ఎ.

మణికరణ్, ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు,డా.జ్ఞానశేఖర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కృష్ణగిరి లు గుర్రాల విజయ్ రెడ్డి ని అభినందించి గౌరవ ప్రధమైన డాక్టరేట్ అవార్డుని ప్రధానం జేయడం జరిగింది.

ఈ సందర్భంగా విజయ్ రెడ్డి మాట్లాడుతూ వైద్యరంగంలో తన సేవలను గుర్తించి తమిళనాడులో ఈ అవార్డును అందుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

డాక్టర్ పట్టానందుకున్న విజయ్ రెడ్డిని రాచర్ల గొల్లపల్లి గ్రామస్తులు అభినందించారు.

ఢిల్లీలో చంద్రబాబు ..  బిజీ బిజీ