రాచకొండ పర్యాటక ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలి: బద్దుల కృష్ణకుమార్

యాదాద్రి భువనగిరి జిల్లా: రాచకొండ పర్యాటక ఉత్సవాలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బుధవారం రాచకొండ రాజప్ప సమితి అధ్యక్షుడు బద్దుల కృష్ణ కుమార్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు.

గత ఏడు సంవత్సరాల నుండి రాచకొండ రాచప్ప సమితి రాష్ట్ర పర్యాటక భాష,సంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించే వారని,గత సంవత్సరం నుండి ప్రభుత్వం ద్వారా ఎలాంటి సహకారం లేక ఆర్థిక ఇబ్బందులకు గురై,దాతల సహకారంతో ఉత్సవాలు నిర్వహించబడ్డాయన్నారు.

ఈసారి పర్యాటక ఉత్సవాలకు ప్రభుత్వమే నిర్వహించే బాధ్యతలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవ తీసుకుని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

వీడియో వైరల్: ఫోన్ ఇవ్వనందుకు తల్లిని బ్యాట్ తో చావబాదిన కొడుకు!