పండగ వరకు అడవికే అంకితం అంటోన్న పుష్ప

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పూర్తి రివెంజ్ డ్రామాగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో బన్నీ పాత్ర చాలా రఫ్‌గా ఉండబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

ఇక లాక్‌డౌన్ తరువాత ఈ సినిమా షూటింగ్‌ను మారేడుమిల్లి అడవి ప్రాంతంలో మొదలుపెట్టారు చిత్ర యూనిట్.

అయితే చిత్ర యూనిట్ సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో ఈ సినిమా షూటింగ్ మరోసారి వాయిదా వేశారు.

కాగా హైదరాబాద్‌లో ఓ అడవి సెట్ వేసి పుష్ప చిత్ర షూటింగ్ నిర్వహించారు చిత్ర యూనిట్.

అయితే అక్కడ షూటింగ్ ముగియడంతో ఇప్పుడు మరోసారి మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకునేందుకు చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లేందుకు రెడీ అయ్యింది.

అల్లు అర్జున్‌తో పాటు చిత్రంలోని ఇతర ముఖ్య నటీనటులు కూడా మారేడుమిల్లి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

జనవరి నెల మొదలవగానే అడవికి పయనమయ్యేందుకు పుష్ప రాజ్ రెడీ అవుతున్నాడు.ఇక అక్కడే సంక్రాంతి వరకు షూటింగ్ జరుపుకోనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈసారి మరింత జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పవర్‌ఫుల్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి సంక్రాంతి కానుగా ఏదైనా ట్రీట్ ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకులతో పాటు యావత్ సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మరి సంక్రాంతికి పుష్ప ఏదైనా అప్‌డేట్ ఇస్తాడో లేడో చూడాలి.

శంషాబాద్ ఎయిర్‎పోర్టు వద్ద ఆపరేషన్ చిరుత సక్సెస్..!