‘పుష్ప’ లేటెస్ట్‌ అప్‌ డేట్‌ వచ్చేసింది, శివరాత్రి స్పెషల్‌ పై ఉత్కంఠ

అల్లు అర్జున్‌ సుకుమార్‌ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్‌ తమిళనాడులోని అటవి ప్రాంతంలో జరుగుతున్న విషయం తెల్సిందే.

దాదాపు మూడు నాలుగు వారాలుగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప ఎట్టకేలకు ముగించేశారు.ఇటీవల అల్లు అర్జున్‌ దుబాయి వెళ్లి వచ్చారు.

వెంటనే పుష్ప షూటింగ్ కోసం మళ్లీ తమిళనాడు వెళ్లారు.ఎట్టకేలకు తమిళనాడు షెడ్యూల్‌ ను ముగించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

సినిమా షెడ్యూల్‌ లో బన్నీ మరియు రష్మిక మందన్నా కాంబోలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు.

యాక్షన్‌ సన్నివేశాలను ఎక్కువగా మేరేడుమిల్లి ప్రాంతంలో తీయగా లవ్‌ మరియు రొమాంటిక్ సీన్స్ ను మాత్రం తమిళ నాడులో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.

ఇక హైదరాబాద్‌ లో తదుపరి షెడ్యూల్‌ ను ప్లాన్‌ చేస్తున్నారు.కాని అందుకు సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో ఐటెం సాంగ్‌ చిత్రీకరణ కోసం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియోలో సెట్టింగ్‌ ను వేయిస్తున్నారు.

ఒకటి రెండు వారాల్లో ఐటెం సాంగ్‌ లో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని నిర్ణయించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం పుష్ప సినిమా టీజర్ కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.ఆమద్య మహా శివ రాత్రి సందర్బంగా పుష్ప నుండి అప్ డేట్ వస్తుందని అన్నారు.

ఆ అప్ డేట్ ఇప్పుడు టీజర్‌ రూపంలో శివ రాత్రికి వస్తుందని చాలా మంది నమ్మకంగా వెయిట్‌ చేస్తున్నారు.

మరి అది నిజమా కాద అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.అభిమానులు మాత్రం చాలా ఉత్కంఠ తతో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా లో సునీల్‌ కీలక పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్‌ స్టార్ విలన్గ్‌ గా కనిపించబోతున్నాడు.

కెనడాలో భారతీయ విద్యార్ధి దారుణ హత్య.. 8 నెలల క్రితమే స్టూడెంట్ వీసా, అంతలోనే ఇలా