విజయ్ కోసం ఆ అలవాటును మార్చుకున్న పూరీ జగన్నాథ్

దర్శకుడు పూరీ జగన్నాథ్ మాస్ సినిమాలకు పెట్టింది పేరు.పూరీ జగన్నాథ్ కు పరిశ్రమలో అందరి డైరెక్టర్ ల కంటే ఒక ప్రత్యేక శైలి ఉంటుంది.

అది అయన సినిమాలో కూడా కనిపిస్తుంది.ముఖ్యంగా సినిమాను తెరకెక్కించడం పూరీ స్టైలే వేరని చెప్పవచ్చు.

ఎంత వేగంగా కథ రాస్తాడో అంతే వేగంగా సినిమాను కూడా కంప్లీట్ చేసేస్తాడు.

అయితే ఏ హీరో అయినా ఇప్పటి వరకు పూరీ తన స్టైల్ ను మార్చుకోలేదు.

అయితే విజయ్ దేవరకొండ గురించి ఈ అలవాటును మార్చుకున్నాడట పూరీ జగన్నాథ్.ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా తీస్తున్న పూరీ బాలీవుడ్ లో ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తుండటం మనకు తెలిసిందే.

అయితే కరోనా అనేది ఒక కారణం కాగా పాన్ ఇండియా కావడంతో బాలీవుడ్ టేస్ట్ కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తూ ఈ విషయాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.పూరీ తన సినిమాను ఇన్ని రోజులు తెరకెక్కించడమేంటని సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అయితే ఇప్పుడు ఇటు టాలీవుడ్ లో, బాలీవుడ్ లో ఈ సినిమాపై హాట్ టాపిక్ నడుస్తోంది.

మరి లైగర్ సినిమా ఏ మేరకు అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి.

సినీ నిర్మాత బండ్ల గణేశ్ పై కేసు నమోదు