పూరి జగన్నాథ్ పెద్ద మోసగాడు.. పరువు తీద్దాం పదండి.. లేఖ రాసిన అభిమాని?

పూరి జగన్నాథ్ లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల చేసినప్పటికీ డిజాస్టర్ కావడంతో పెద్ద డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారంటూ వారికి తమ డబ్బు తిరిగి చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ తనకు కొంత సమయం ఇస్తే అందరి డబ్బు తిరిగి చెల్లిస్తానని చెప్పినప్పటికీ కొందరు మాత్రం ఫిలిం ఛాంబర్ ఎదుట ధర్నా చేయడానికి సిద్ధమయ్యారంటూ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ తను పరువు తీసే పనులు చేస్తే వారికి రూపాయి కూడా ఇవ్వననీ చెప్పారు.

ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను శోభన్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పూరి జగన్నాథ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తనకు ప్రాణహానీ ఉందని రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు.

అయితే తాజాగా ఈ వ్యవహారపై ఓ అభిమాని స్పందిస్తూ పూరి జగన్నాథ్ పెద్ద మోసగాడు అంటూ ఓ లేఖ రాయడంతో ఈ లేక ప్రస్తుతం వైరల్ అవుతుంది.

"""/"/ అవును డేరింగ్ అండ్ యాక్షన్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పెద్ద మోసగాడు ఇండస్ట్రీలో ఉండే హీరోలందరికీ ఎన్నో హిట్స్ మైల్ స్టోన్ లాంటి హిట్స్ ఇచ్చి ప్రస్తుతం ఇలాంటి కుట్రల మధ్య నలిగిపోతున్న ఈయనకు కచ్చితంగా పరువు తీయాలి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోలు అందరికీ బ్లాక్ బాస్టర్ ఇచ్చారు కనుక ఈయన పై మోసగాడు అనే ముద్ర వేయాలి.

ఎంతోమంది దర్శక నిర్మాతల దగ్గర వందల కోట్ల రూపాయలు నష్టపోయిన ఎప్పుడు వారి పేర్లను బయటపెట్టినందుకు, వారిని ఒక్క మాట అననందుకు పూరీ జగన్నాథ్ కుటుంబాన్ని రోడ్డుకి లాగాల్సిందే.

పూరి జగన్నాథ్ కెరీర్ లో ఎన్నో ఫ్లాప్స్ వచ్చినా ఎన్నో ఇబ్బందులు పడిన తిరిగి బౌన్స్ అవుతూ ఇండస్ట్రీలో నిలబడిన ఈ దర్శకుడి పరువు తీయాల్సిందే అంటూ ఓ అభిమాని పూరికి మద్దతు తెలుపుతూ రాసినటువంటి ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లాంచ్ అయిన కొత్త హెల్మెట్ ఇంటర్‌కామ్.. దీని ధర ఏకంగారూ.25 వేలట..?