వెబ్ సిరీస్ కి కథ సిద్ధం చేసిన పూరీ

టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో బాక్సింగ్ నేపధ్యంలో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

పాన్ ఇండియా మూవీగా దీనిని ఆవిష్కరిస్తున్నాడు.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.

ఇదిలా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.అయితే ఈ లాక్ డౌన్ టౌన్ టైంలో పూరీ ఒక వెబ్ సిరీస్ కి కథ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఈ కథని తెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తుంది.

ఓటీటీ చానల్స్ అన్ని కూడా వెబ్ సిరీస్ ల మీద దృష్టిపెట్టాయి.హిందీతో పాటు రీజనల్ బాషలలో కూడా వెబ్ సిరీస్ లని తెరకెక్కిస్తున్నారు.

ఫేడ్ అవుట్ హీరోయిన్స్ నుంచి ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ అందారూ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక హీరోలు కూడా వెబ్ సిరీస్ లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇక దర్శకులు కూడా వెబ్ సిరీస్ లా బాట పడుతున్నారు.ఇప్పుడు పూరి కూడా అదే బాటలో వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇక విజయ్ సినిమా తర్వాత ఈ వెబ్ సిరీస్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉంది.

ఇక ఇది కూడా మాఫియా నేపధ్యంలో నడిచే కథతోనే ఉంటుందని టాక్.మరి దీనిపై పూరి క్లారిటీ ఇచ్చేంత వరకు వేచి చూడక తప్పదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే3, శుక్రవారం 2024