కొడుకు కోసం పూరీ ఏం చేస్తున్నాడంటే..?

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్‌తో బొంబాట్ హిట్ కొట్టాడు.

రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో పూరీ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సక్సెస్‌ను అందుకున్నాడు.

కాగా పూరి తన కొడుకును హీరోగా పెట్టి రొమాంటిక్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాతో ఆకాష్ పూరికి ఎలాగైనా హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు ఈ డైరెక్టర్.

కాగా ఈ సినిమా కోసం పూరి తనలోని మల్టీ టాలెంట్‌ను బయటకు తెస్తున్నాడు.

రొమాంటిక్ చిత్రం షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు పూరీ డైరెక్టర్‌గానే కాకుండా ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలోని ఓ పాటకు పూరీ లిరిక్స్ కూడా అందించినట్లు తెలుస్తోంది.

నువ్వు నేను ఈ క్షణం అంటూ సాగే ఈ పాటను పూరీ స్వయంగా రాసినట్లు మరో నిర్మాత చార్మి తెలిపింది.

కాగా శనివారం సాయంత్రం 5 గంటలకు ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను రిలీజ్ చేస్తున్నట్లు చార్మి తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలిపింది.

మరి పూరి రాసిన ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి.ఇక రొమాంటిక్ సినిమాతో కేతిక శర్మ హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

మణిరత్నం కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమాలో ఒక కీలక పాత్ర లో నటిస్తున్న స్టార్ హీరోయిన్…