పోకిరి, బిజినెస్ మ్యాన్ సీక్వెల్స్ ఉన్నాయా.. పూరీ ఏం చెప్పారంటే?

పూరీ జగన్నాథ్, మహేష్ బాబు కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు రాగా రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

అందులో ఒకటి పోకిరి సినిమా కాగా మరొకటి బిజినెస్ మ్యాన్.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులను తిరగరాసాయి.

పోకిరి సి నిమా పూరీ సొంత నిర్మాణ సంస్థ అయినా వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్ సంస్థలపై తెరకెక్కించారు.

ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇందులో మహేష్ కృష్ణ మనోహర్ ఐపీఎస్ గా, పండుగాడు గా రెండు వేరియేషన్స్ లో నటించి మెప్పించాడు.

ఇక వీరి కాంబోలో వచ్చిన మరో సినిమా బిజినెస్ మ్యాన్.2012లో ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఈ సినిమా మాస్ ఆడియెన్స్ ను బాగా అలరించింది.

ఈ సినిమాలో సూర్య భాయ్ రోల్ లో ఈయన చెప్పిన మాస్ డైలాగ్స్ ఇప్పటికి ఆకట్టు కుంటున్నాయి.

ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ కాంబో కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.

"""/" / మరి ఈ రెండు సినిమాల సీక్వెన్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా తర్వాత ముచ్చటగా మూడవసారి మాత్రం సినిమా చేయడానికి సెట్ అవ్వడం లేదు.

తాజాగా పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండలో లైగర్ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఈ సినిమా సీక్వెన్స్ పై పూరీ నోరు విప్పాడు.

"""/" / పూరీకి బిజినెస్ మ్యాన్ మూవీ హిందీలో రీమేక్ చేసే ఆలోచన ఉందని.

త్వరలోనే దాని గురించి ఆలోచిస్తాను అని తెలిపాడు.ఇంకా ఈ రెండు సినిమాలకు సీక్వెన్స్ చేద్దాం అని గతంలో అనుకున్నాం కానీ మాకు కుదరలేదు.

అన్ని కలిసి వస్తే తప్పకుండ పోకిరి తో పాటు బిజినెస్ మ్యాన్ సినిమాల సీక్వెన్స్ చేస్తానని తెలిపాడు.

మరి ఇది ఆచరణలోకి ఎప్పుడు మారుతుందో చూడాలి.

హైవేలో సూపర్‌బైక్‌పై హల్చల్ చేసిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్