కరణ్ జోహార్ నిర్మాణంలో పూరి జగన్నాథ్ మరో పాన్ ఇండియా

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతూ ఉండటం విశేషం.

ఇక ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా అయినా కేవలం మూడు నెలల్లో పూర్తి చేసే పూరి జగన్నాథ్ ఈ మూవీ కోసం ఎక్కువ రోజులు టైమ్ తీసుకుంటున్నాడు.

దానికితోడు కరోనా లైగర్ మూవీ షూటింగ్ కి పెద్ద అడ్డంకిగా మారుతుంది.ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత కూడా పూరి జగన్నాథ్ పాన్ ఇండియా మూవీస్ చేస్తారని గతంలోనే చార్మీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

"""/"/ ఇదిలా ఉంటే పూరి నెక్స్ట్ సినిమాని కరణ్ జోహార్ నేరుగా నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వస్తుంది.

అది కూడా సౌత్ స్టార్ తోనే పాన్ ఇండియారేంజ్ మూవీనే పూరితో కరణ్ ప్లాన్ చేస్తున్నారని బిటౌన్ లో వినిపిస్తున్న మాట.

తెలుగు నిర్మాతలు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న నేపధ్యంలో కరణ్ జోహార్ కూడా సౌత్ మార్కెట్ మీద దృష్టి పెట్టి పూరి జగన్నాథ్ తోనే మొదటి ప్రయత్నం చేస్తున్నారని టాక్ నడుస్తుంది.

ఇక పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా స్టార్స్ తో చేయాలంటే అది లైగర్ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది.

అలాగే లైగర్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్, బాలయ్యతో ఒక మూవీ, పవన్ కళ్యాణ్ తో మూవీలని పూరి లైన్ లో పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

ట్రిపుల్ రోల్ లో నటించిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీరే !