ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ పూరి నుండి సినిమా రావడం అసాధ్యం!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ దర్శకత్వం లో వచ్చిన లైగర్ సినిమా తీవ్రంగా నిరాశ పర్చిన విషయం తెలిసిందే.

కలెక్షన్స్ విషయం లో మరి దారుణంగా లైగర్ నిరాశ పర్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే.

100 కోట్ల రూపాయల సినిమా అంటూ గతంలో తెగ ప్రచారం చేసిన చిత్ర యూనిట్ సభ్యులు కనీసం 20 కోట్ల కలెక్షన్స్ ని కూడా రాబట్టుకోలేక పోయారు.

ఆ సినిమా నిర్మాతగా పూరి జగన్నాథ్ కి తీవ్ర నష్టాలను మిగిల్చింది అనేది ఒక వర్గం టాక్.

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన లెక్కలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.సినిమా నిర్మాణం కోసం విదేశీ మనీ ని అనుమతి లేకుండా పెద్ద మొత్తం లో పూరి జగన్నాథ్ వాడాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

ఆ విషయం లో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక క్లారిటీ అయితే రాలేదు.

ఈ సమయం లోనే ఈడీ పూరి జగన్నాథ్ మరియు చార్మి లను విచారించేందుకు పిలిచిన విషయం కూడా తెలిసిందే.

ఇలాంటి సమయంలో పూరి జగన్నాథ్ నుండి ఒక హిట్ సినిమా వస్తుందా అంటే డౌటే అన్నట్లుగా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంత ఒత్తిడిలో పూరి జగన్నాథ్ మళ్లీ నిర్మాతగా సినిమా తీస్తాడా.ఒకవేళ ఆయన దర్శకత్వం వహిస్తానన్న ఇతర నిర్మాతలు నిర్మించేందుకు ముందుకు వస్తారా అనేది అనుమానంగా ఉంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.

"""/"/ ప్రస్తుతం పూరి జగన్నాథ్ రెండు సినిమా లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.

ఒకటి బాలీవుడ్ లో కాక మరొక టాలీవుడ్ లో.మొదట ఏది కార్యరూపం దాల్చబోతుంది అనేది క్లారిటీ లేదు.

కానీ త్వరలోనే ఒకటి ఉంటుందని ఇన్నాళ్లు ప్రచారం జరిగింది.కానీ ఈ కేసులు ఇతర విషయాల వల్ల పూరి జగన్నాథ్ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పూరి మరియు ఛార్మిలు ప్రస్తుతం పీకలలోతు కష్టాల్లో అయితే ఉన్నారు.

రామ్ చరణ్ శంకర్ కి దొరికిన గొప్ప నిధి… రాజీవ్ కనకాల కామెంట్స్ వైరల్!