టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు.వారి వారసులు ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చారు.
ఇండస్ట్రీకి వచ్చిన వారసులను ఆ స్టార్స్ నిలబెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు.కొందరు నిలబడుతారు.
కొందరు పడిపోతారు.ఇండస్ట్రీలో ఉన్న అవకాశాలు మరియు పరిచయాలతో వారసులు చాలా కాలం పాటు సక్సెస్ లు లేకున్నా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది.
కనుక వారసులు చాలా మంది ఇప్పటికే ప్లాప్ లు పడుతున్నా కూడా కంటిన్యూ అవుతున్నారు.
సోషల్ మీడియాలో వారసుల గురించి ఎలాంటి వార్తలు వచ్చాయినా కూడా వాటిని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తూనే ఉంటారు.
ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తమ్ముడు సాయి రామ్ శంకర్ గురించిన వార్తలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సాయి రామ్ శంకర్ హీరోగా 'ఒక పథకం ప్రకారం' అనే సినిమా రూపొందింది.
జూన్ 24న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.ఆ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్నట్లుగా ప్రకటించినా కూడా ఇండస్ట్రీ వర్గాల వారు కాని జనాలు కాని మీడియా వారు కాని కనీసం స్పందించడం లేదు.
పూరి జగన్నాద్ తమ్ముడు అయినా కూడా ఆయన ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లతో కుదేలయ్యాడు.
"""/"/
ఆయన మళ్లీ సక్సెస్ లను దక్కించుకుంటాడు అనే నమ్మకం ను చాలా మంది కోల్పోయారు.
కాని ఆయన మాత్రం తనపై తనకు ఉన్న నమ్మకం మరియు కథ పై ఉన్న నమ్మకం తో ఒక పథకం ప్రకారం ఈ సినిమాను చేయడం జరిగింది.
వినోద్ విజయన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పోస్టర్ చాలా విభిన్నంగా.సినిమా లో సాయి రామ్ శంకర్ రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడు అంటూ తేలిపోయింది.
ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.ఖచ్చితంగా జూన్ లో విడుదల చేసి తీరుతాం అంటున్నారు.
వామ్మో, మన ఆటో డ్రైవర్లు కొరియన్ ఇరగదీశారుగా.. అవాక్కైన సౌత్ కొరియన్ జంట!