ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి లేఖ

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( AP BJP Chief Purandeshwari ) లేఖ రాశారు.

ఈ మేరకు దేవాదాయశాఖ సిబ్బంది సేవలను ఎన్నికల్లో వినియోగించుకోవద్దని విన్నవించారు.వచ్చే ఎన్నికల్లో దేవాదాయ శాఖ సిబ్బందిని వినియోగించుకోవాలని కలెక్టర్లు, కొందరు ఉన్నతాధికారులు సీఈవోకు( CEO ) సూచించినట్లు తెలిసిందని పురంధేశ్వరి లేఖలో పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఎన్నికల్లో దేవాదాయ శాఖ( Endowment Employees ) సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్న నిర్ణయాన్ని పున: సమీక్షించాలని కోరుతున్నామని పురంధేశ్వరి తెలిపారు.

నెగిటివిటీని తట్టుకుని సంచలనాలు సృష్టించిన దేవర.. ఈ ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందిగా!