వారి విలువ తీయకు ! రాజకీయాలపై 'ట్విట్టిన' పూనమ్ కౌర్

అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యవహారాల్లో వివాదాల్లో చిక్కుకుని ప్రతిరోజు వార్తల్లో నిలిచిన సినీ నటి పూనమ్ కౌర్ తాజాగా ఏపీ తెలంగాణ రాజకీయాలపై మాట్లాడి మరోసారి వార్తల్లో నిలిచారు.

ప్రస్తుతం ఏపీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిష్టితి ఉంది.

ఈ నేపథ్యంలో ఆ విషయాల గురించి పూనమ్ పెట్టిన ఓ ట్విట్ కు సంబందించిన వార్త వైరల్ అయ్యింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఆంధ్ర.తెలంగాణ అంటూ మనవాళ్ళు ఫైట్ చేసుకుంటే దానివల్ల ఎవరికి లాభం ఉండదు.

ఈ ఫైట్ ను చూస్తుంటే చిన్నప్పుడు స్కూల్ లో చదువుకున్న పిల్లి.కోతి కథ గుర్తుకు వస్తుంది అని పూనమ్ ట్వీట్ చేసింది.

దీనిపై వైఎస్సార్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి స్పందిస్తూ.నోటుకు కు ఓటు వల్ల ఎవరికి నష్టం.

మీ ట్వీట్ లో స్పష్టత లేదు.మీ ట్వీట్ వలన టీడీపీకి ఒక్క ఓటు కూడా పడదు" అని ట్వీట్ చేశాడు.

దీనిపై పూనమ్ కౌర్ స్పందించింది.మీరు ఎవరి ఫోటోను డీపీగా పెట్టుకున్నావో వారి విలువ తీయకు.

అసభ్య కరమైన పదజాలంతో మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామా.అసభ్యకరమైన భాషను ప్రయోగించి పంచ్ లు వేయడానికి ఇదేమి సినిమా అని ప్రశ్నించింది" పూనమ్ కౌర్.

ఈమెకు ప్రస్తుతం సినిమా అవకాలు లేకపోవడంతో స్వర్ణఖడ్గం అనే సీరియల్ లో ఈమె నటిస్తోంది.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో తీర్పు