ప్రజావాణి ఫిర్యాదులు జాప్యం లేకుండా పరిష్కరించాలి:అదనపు కలెక్టర్

నల్లగొండ జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అదనపు కలెక్టర్ జె.

శ్రీనివాస్, ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్షిస్తూ ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు.

సోమవారం 22 మంది ఫిర్యాదారులు ఫిర్యాదులను సమర్పించగా వీటిలో ఎక్కువగా వ్యక్తిగత అంశాలు,భూములు,ఉద్యోగ,ఉపాధికి సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు.

జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి,జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం : నిరసనల నీడలో డెమొక్రాటిక్ కన్వెన్షన్.. చికాగోలో హై టెన్షన్