ఢిల్లీలో మహిళా రెజ్లర్లకు పీటీ ఉష పరామర్శ

ఢిల్లీలోని జంతర్ మంతర్ లో మహిళా రెజ్లర్ల ఆందోళన కొనసాగుతోంది.ఈ క్రమంలో రెజ్లర్లను భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష పరామర్శించారు.

అనంతరం రెజ్లర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.కాగా భారత రెజ్లంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ రాజీనామా చేయాలని రెజ్లర్లు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే వారం రోజుల క్రితం రెజ్లర్ల ఆందోళనను పీటీ ఉష తప్పు పట్టారు.

రెజ్లర్లు దేశం పరువు తీస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో పీటీ ఉష వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

తాజాగా రెజ్లర్లను పీటీ ఉష పరామర్శించడం చర్చనీయాంశంగా మారింది.

నేను ఉద్యోగం కోల్పోవడానికి అసలు కారణమిదే.. మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు!