పెద్ద బడి లో స్థానికులకే ఉపాధి కల్పించండి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లోని పెద్ద బడి లో స్థానికంగా నివాసముంటున్న వారికే ఉపాధి కల్పించాలని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Balaraju Yadav Is A Former MPTC ) కోరారు.

శనివారం పెద్ద బడి లో పాఠశాల ప్రధానోాపాధ్యాయులు హాన్మాండ్లు అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు.

పెద్ద బడి నీ మంత్రి కెటిఆర్ ఎనిమిది కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించిన పాఠశాలలో తరగతి గదులు,డైనింగ్ హాలు శుభ్రం చేయడానికి సిబ్బంది నియామకం కోసం ఓ ఏజెన్సీకి భాద్యతలు అప్పగించారు.

కాగా స్థానికులు కాకుండా వేరే వారిని విధుల్లో చేర్చుకోగ స్థానికులకు అవకాశం కల్పించాలని, స్థానికంగా చాలా మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారనీ అలాంటి వారికి పెద్ద బడి లో ఉపాధి కల్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హన్మండ్లు కు,విద్యా కమిటీ చైర్మన్ షేహనాజ్ కు వినతి పత్రం అందజేశారు.

వైరల్ వీడియో: ఇకపై నోట్స్ రాయడాలకు చెక్ పడినట్లేనా..?