రైతన్నకు 500బోనస్ ధర చెల్లించాలని నిరసన..
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు పంటకు 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డిలు మాట్లాడుతూ రైతన్న పండించిన పంటకు 500 బోనస్ అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు గోస్కుల రవి, మల్యాల దేవయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్, సహకార సంఘాల అధ్యక్షులు ఏనుగు తిరుపతిరెడ్డి, బండ నరసయ్య యాదవ్, రామ్మోహన్ రావు, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, కౌన్సిలర్లు మారం కుమార్ , నిమ్మశేట్టి విజయ్, గోలి మహేష్, గడ్డం హనుమాన్లు, భైరగోని రమేష్, కమలాకర్ రెడ్డి, చీటి రాధా కిషన్ రావు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, సెస్ డైరెక్టర్ ఆకుల గంగరాజం, చీటి సంధ్యారాణి, నరాల దేవేందర్, శ్రీనివాస్ ,గజ్జల రమేష్, సయ్యద్ బాబా, లిక్కిడి మహేందర్, సందీప్, అప్రోజ్, తదితరులు ఉన్నారు.