ఎంపీ గోరంట్ల మాధవ్ కు నిరసన సెగ

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్ కు నిరసన సెగ తగిలింది.

ఆయన కాన్వాయ్ ని అడ్డుకున్న సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలోని  హిందూపురంలో చోటు చేసుకుంది.

హిందూపురంలోని మార్కెట్ వద్ద  ఆయన కాన్వాయ్ కి  తెదేపా నాయకులు అడ్డుపడ్డారు.  గోబ్యాక్ గోరంట్ల మాధవ్ అంటూ నినాదాలు చేశారు.

దీంతో పోలీసులు ఆందోళనకారులను తోసి  వేయడంతో కాన్వాయ్ ముందుకు సాగింది.

పూరి జగన్నాథ్ ప్లాప్స్ కి కారణం ఎవరు..?ఇక ఆయన సినీ కెరియర్ ముగిసినట్టేనా..?