ప్రశ్నించే గొంతును కాపాడుకుంటారా? పిసికేస్తారా?..: బండి సంజయ్
TeluguStop.com
కరీంనగర్ లో బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను ప్రశ్నించే గొంతుకనని చెప్పారు.ఈ క్రమంలో కాపాడుకుంటారా? పిసికేస్తారా? అని ప్రశ్నించారు.
అంతిమ నిర్ణయం ప్రజలదేనని బండి సంజయ్ తెలిపారు.ప్రజా సమస్యలపై సీఎం కేసీఆర్ తో యుద్ధం చేస్తున్నానని చెప్పారు.
ఈ క్రమంలోనే తనను అణచివేసేందుకు 74 కేసులు పెట్టినా భయపడలేదని పేర్కొన్నారు.తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్న బండి సంజయ్ రెండు లక్షల పోస్టుల భర్తీ బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Méthodes De Paiement Et PayPal : Guide Pratique Pour Joueurs Français