కర్నూలు పోలీస్‎స్టేషన్‎లో చోరీ ఘటనలో పురోగతి

కర్నూలు పోలీస్‎స్టేషన్‎లో చోటు చేసుకున్న చోరీ ఘటనలో పురోగతి లభించింది.పీఎస్ లో వెండి, నగదు మాయం వెనుక ఇంటి దొంగల హస్తమే ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణబాబును అరెస్ట్ చేశారు.

అదేవిధంగా నిందితులకు సహకరించిన భరత్ సింహ, విజయ్ భాస్కర్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో నిందితుల నుంచి రూ.10 లక్షల నగదుతో పాటు 81.

52 కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు.క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే శాఖా పరమైన చర్యలు తప్పవని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని వెల్లడించారు.

ఆ కారణంతోనే బిడ్డను కోల్పోయాము.. ఎమోషనల్ అయిన అవినాష్!