ఓయు బిజినెస్ మేనేజ్‌మెంట్ హెడ్ గా ప్రొ.ఎర్ర జహంగీర్ బాధ్యతలు

యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District) మోటకొండూర్ మండలం చందేపల్లి గ్రామానికి చెందిన ఎర్ర జహంగీర్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం హెడ్(అధిపతి)గా పదవి బాధ్యతలు స్వీకరించారు.

వంద ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో అణగారినవర్గాల మార్గదర్శకులు,దళితుడుఎర్ర జహంగీర్ మాదిగ మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ ( Osmania University Business And Management )విభాగం హెడ్ గా నియమితులవడంపై ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పలువురు అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం హెడ్ గా నియమితులవడం గొప్ప అవకాశంగా భావిస్తూ, విభాగానికి నా వంతు కృషి చేస్తానన్నారు.

సీనియర్ ప్రొఫెసర్లు,సహోద్యోగులు, అనుబంధ కళాశాలలు మరియు రీసెర్చ్ స్కాలర్లు మరియు విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం హెడ్ గా ప్రొఫెసర్ వై జహంగీర్ మాదిగ నియామకం కావడంతో చందేపల్లి గ్రామ పెద్దలు,యువకులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

ఆరోగ్యానికి ప‌సుపు మంచిదే.. కానీ వారు మాత్రం తిన‌కూడ‌దు..!