ముస్తఫా, ప్రియమణిలది అక్రమ సంబంధం.. మొదటి భార్య సంచలన కామెంట్స్!

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రియమణి.ఈమె పరిచయం గురించి అందరికీ తెలిసిందే.

ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పటికీ వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.

పైగా బుల్లితెర డాన్స్ షోలో కూడా జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ప్రియమణి.ఇక ఈమె 2017 లో ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకుంది.

అంతేకాకుండా తన భర్త గురించి కూడా కొన్ని విషయాలు పంచుకుంది ప్రియమణి.తనకు అద్భుతమైన సహచరుడు దొరికాడని తనకు ఎంతో సపోర్టింగ్ చేస్తాడని అది తన అదృష్టమని తెలిపింది.

అంతేకాకుండా తన భర్త ఇచ్చే సపోర్ట్ తో సినిమాలలో చేయగలుగుతున్నానని గతంలో తెలిపింది.

ఇక తమ మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా సర్దుకుంటామని తెలిపింది.

కానీ తాజాగా తన భర్తతో తన పెళ్లి జీవితం అక్రమ సంబంధం అని ముస్తఫా రాజ్ మొదటి భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది.

నిజానికి ముస్తఫా రాజ్ కు ప్రియమణితో కంటే ముందే మరో యువతి ఆయేషా తో పెళ్లి జరిగింది.

"""/"/ అంతేకాకుండా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2010 నుండి విడివిడిగా ఉంటున్నారు.

దీంతో కొన్ని సంవత్సరాల తర్వాత ప్రియమణి పెళ్లి చేసుకున్నాడు.అయినా కానీ తన మొదటి భార్య ఎలా బతుకుతుందో అని ఆలోచించి తనకు ప్రతి నెలా ఎంతో కొంత డబ్బు పంపిస్తున్నాడట ముస్తఫా రాజ్.

"""/"/ తాజాగా తన మొదటి భార్య అయేషా తన భర్త గురించి మీడియా ముందు నోరు విప్పింది.

తన పిల్లలను పట్టించుకోవడం లేదంటూ తెలిపింది.దాంతో ఈ విషయం గురించి స్పందించాడు ముస్తఫా.

తన మీద వచ్చిన ఆరోపణలు అబద్ధమని, పిల్లల పెంపకం కోసం అవసరమైనంత డబ్బుని తనకు పంపిస్తున్నానని తెలిపాడు.

కానీ ఆమెకు తన దగ్గర నుంచి మరింత డబ్బుని ఆశించాలని చూస్తుందని, హింసించానంటూ అంటుందని.

ఒక వేళ తనని హింసిస్తే ఇంతకాలం ఎందుకు ప్రశ్నించలేదని అని అన్నాడు. """/"/ ఇక అయేషా.

ముస్తఫా తనకు మాజీ భర్త కాదని ఇప్పటికీ కూడా తనకు తాళి కట్టిన భర్త అని తెలిపింది.

కానీ ప్రియమణితో అతడి వివాహం చెల్లదని.ఆ పెళ్లికి ముందు తాము విడాకులకు కూడా దరఖాస్తు చేయలేదని కాబట్టి అక్రమం కిందికే వస్తుందని తెలిపింది.

ఇద్దరు పిల్లల తల్లి స్థానంలో మీరుంటే ఏం చేస్తారో చెప్పండి అంటూ ప్రశ్నించింది.

వీలైతే సమస్య గురించి మాట్లాడుకొని చక్కదిద్దుకోవాలి కానీ లేదంటే వేరే దారి చూసుకోవాలి అని తెలిపింది.

ఈ విషయం గురించి ప్రియమణి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే1, బుధవారం 2024