తిరుమల కొండపైకి ప్రైవేట్ వాహనాలు నిలిపివేత

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

దీనిలో భాగంగా సాయంత్రం స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది.

దీంతో తిరుమల కొండపైకి ప్రైవేట్ వాహనాలను పోలీసులు నిలిపివేశారు.కొండపై 12 వేల వాహనాలకే టీటీడీ అధికారులు పార్కింగ్ ఏర్పాటు చేశారు.

పార్కింగ్ ప్లేస్ నిండిపోవడంతో వాహనాలను ఆపేస్తున్నారు.అలిపిరి వద్దే వాహనాలను పార్కింగ్ చేసి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా తిరుమల చేరుకోవాలని పోలీసులు సూచించారు.

ఆడపిల్లకు చదువెందుకని హేళన.. తొలి ప్రయత్నంలో జడ్జి.. మేఘన సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!