వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారని తెలుస్తోంది.

దాదాపు పది నిమిషాల పాటు షర్మిలతో ఆయన మాట్లాడినట్లు సమాచారం.షర్మిల అరెస్ట్ వ్యవహారంపై ప్రధాని మోదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలో షర్మిలకు జరిగిన ఘటనపై మెదీ సానుభూతి తెలిపారు.ఇటీవల షర్మిలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అంతకముందు రోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఆమె పాదయాత్రను అడ్డుకున్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు.

ఈ నేపథ్యంలో దెబ్బతిన్న తమ వాహనాలను సీఎం కేసీఆర్ చూపేందుకు ప్రగతిభవన్ కు వెళ్తున్న షర్మిల కారును పోలీసులు అడ్డుకున్నారు.

అనంతరం ఆమెను అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పీఎస్ కు తరలించారు.

ఎయిర్ పోర్ట్ లో క్లైమాక్స్ షూట్ చేయబడ్డ తెలుగు సినిమాలు ఇవే !